టెస్టుల్లో నెం.1పై కివీస్‌ కన్ను


ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 113 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానంతో కొనసాగుతోంది. న్యూజిలాండ్‌ 109 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ బుధవారమే కొలంబోలో ఆరంభం కానుంది. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానమే లక్ష్యంగా న్యూజిలాండ్‌ జట్టు శ్రీలంకతో పోరుకు సిద్ధమెంది.

అయితే త్వరలో వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2-0తో నెగ్గితే తిరిగి అగ్రస్థానం కైవసం చేసుకుంది. వన్డే ప్రపంచకప్‌ రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌.. బలహీనంగా కనబడుతున్న శ్రీలంకని టెస్ట్ సిరీస్ లో క్లీన్ స్వీప్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఐతే, సొంత మైదానంలో శ్రీలంకలో తక్కువ అంచనా వేయలేం అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.