రాశీని మాస్’గా వాడుతున్నాడు

అందాల రాశీఖన్నాని మళ్లీ మళ్లీ టచ్ టచ్ చేస్తున్నాడు మాస్ మహారాజా. ఆమెతో బాగా కనెక్ట్ అయ్యాడు. మళ్లీ మళ్లీ రొమాన్స్ చేసేందుకు ఆసక్తిచూపుతున్నాడు. ‘బెంగాలీ టైగర్’లో తొలిసారి రాశీతో రొమాన్స్ చేశాడు రవితేజ. ఆ తర్వాత ‘టచ్ చేసి చూడు’ కోసం మరోసారి టచ్ చేశారు. రవితేజ టచ్ బాగుంటుందని రాశీ మురిసిపోయింది. ఇప్పుడు రవితేజ-రాశీల జోడీ మరోసారి కుదిరింది.

ప్రస్తుతం రవితేజ ‘డిస్కో రాజా’తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి వి.ఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. పాయల్ రాజ్ పుత్, నభా నటేషా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ సినిమా తర్వాత ‘ఆర్ఎక్స్100’ దర్శకత్వంలో రవితేజ సినిమా ఉండనుంది. ఈ చిత్రానికి ‘మహా సముద్రం’ టైటిల్ ప్రచారంలో ఉంది.

ఈ సినిమా కోసం హీరోయిన్ గా ముందుగా అతిదిరావుని అనుకొన్నారు. ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా చేయలేకపోతుంది. ఈ నేపథ్యంలో అతిది స్థానంలో రాశీఖన్నాని తీసుకొన్నారు. రవితేజ సినిమా కావడంతో రాశీ సంతోషంగా ఒప్పేసుకొన్నట్టు సమాచారమ్. మహాసముద్రంలో రవితేజ-రాశీల మధ్య ఘూటు రొమాన్స్ ఉండనుందని తెలుస్తోంది.