‘సరిలేరు నీకెవ్వరూ’ టైటిల్ సాంగ్ విన్నారా.. ?


సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకి అదిరిపోయే గిఫ్ట్ అందజేశారు. ఆయన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’. రష్మిక మందన కథానాయిక. అనిల్ రావిపూడి దర్శకుడు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే మహేష్ జవాన్ లుక్ బయటికొచ్చింది. తాజాగా ఆగస్టు 15 కానుకగా సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్ ని విడుదల చేసింది చిత్రబృందం. దేశ రక్షణ కోసం సైనికులు చేసిన కీర్తి శ్లాగిస్తూ సాగిందీ పాట. అద్భుతంగా ఉంది.

‘భగ భగ భగ మండే నిప్పుల వర్షమొచ్చినా.. జనగనమణ అంటూనే దూకే వాడే సైనికులుడు.. ‘ అంటూ టైటిల్ సాంగ్ సాగింది. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలని అందించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదారాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు-అనిల్ సుంకర-మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.