పాపం.. పరశురామ్ !

‘గీత గోవిందం’తో దర్శకుడు పరశురామ్ పంటపండినట్టే కనిపించింది. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-రష్మికమందన జంటగా నటించిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత పరశురామ్ కి బన్నీకి ఛాన్స్ ఇవ్వడం దాదాపు ఖాయం అనుకొన్నారు. అందుకు తగ్గట్టుగానే పరశురామ్ తో బన్నీ సినిమా ఉంటుందని గీతా ఆర్ట్స్ హింట్ ఇచ్చింది.

ఇంతలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేయబోయే సినిమాకు పరశురామ్ దర్శకుడుగా ఫిక్స్ అయ్యాడు. ఎందుకో పరశురామ్ స్కిప్ట్ నిర్మాత అల్లు అరవింద్ కి పెద్దగా నచ్చలేదు. దీంతో దర్శకుడు కొరటాల శివ ద్వారా స్వయంగా మహేష్ ని కలిసి కథ వినిపించాడు పరశురామ్. మహేష్ కి కథ బాగా నచ్చేసింది. కానీ, ఇప్పుడు ఆ కథని చేయలేనని మెసేజ్ పెట్టినట్టు తెలిసింది.

పరుశురామ్ వినిపించిన స్క్రిప్ట్ లో బ్యాంకు రుణాల ఎగవేత, స్కామ్ లాంటి వ్యవహారాలు వున్నాయట. అలాంటి సీరియస్ సబ్జెక్ట్ ఫ్రస్తుతం చేయడం ఇష్టం లేక మహేష్ బాబు నో చెప్పారో? ప్రస్తుతం వంశీ పైడిపల్లితో సినిమా చేయాలనుకుంటున్నారు కనుక, ఆ తరువాత రాజమౌళి ప్రాజెక్టు రెడీగా వుంది కనుక, పరుశురామ్ ను అలా వెయిటింగ్ లో పెట్టేయడం ఇష్టం లే నో చెప్పారో తెలియదు. మొత్తానికి.. అటు గీతా ఆర్ట్స్, ఇటు మహేష్ పరశురామ్ ని వదిలించుకొన్నట్టు తెలుస్తోంది.