‘సాహో ది గేమ్’ ఇప్పుడు గూగుల్‌ ప్లే స్టోర్‌లో !

బాహుబలి ప్రభాస్ నటించిన ‘సాహో’ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకంటే ముందే ‘సాహో ది గేమ్’ తీసుకొస్తున్న సంగంతి తెలిసిందే. ఇటీవల ఈ గేమ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆ తర్వాత ఐవోఎస్‌లో గేమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడీ ఈ గేమ్ ని గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. గేమ్‌ ఆడాలనుకునే వారు గూగుల్‌ ప్లేలోకి వెళ్లి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ లింక్‌ ను కూడా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ గేమ్‌ యాప్‌ను పిక్సలాట్‌ ల్యాబ్స్‌ అభివృద్ధి చేసింది.

‘సాహో’ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహించిచారు. శ్రద్ధా కపూర్‌ కథానాయిక. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దాదాపు రూ. 300కోట్ల భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది.