శ్రద్దా బాగా సపోర్ట్ చేసింది

బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ ‘సాహో’తో తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ నెల 30న సాహో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభాస్.. హీరోయిన్ శ్రద్దా గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. “సాహో కోసం శ్రద్దా రెండేళ్లు పని చేసింది. ముంబై నుంచి ఇక్కడి వచ్చి.. రెండేళ్ల పాటు ఓ సినిమా కోసం పని చేయడం మాములు విషయం కాదు. అంతేకాదు.. ఒక్కరోజు కూడా ఆమె వలన ప్రొడక్షన్ ప్రాబ్లమ్ రాలేదు. చాలా బాగా సపోర్ట్ చేసింది. చాలా బాగా నటించింది. యాక్షన్ సీన్స్ ఇరగదీసింది. సాహో కోసం శ్రద్దా దొరకడం మా అదృష్టం” అన్నారు ప్రభాస్.

సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ తెరకెక్కింది. బాహుబలి తర్వాత టాలీవుడ్ నుంచి రాబోతున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కూడా ఇదే. సాహో కోసం రూ. 350కోట్లు ఖర్చుపెట్టారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండనుందని చెబుతున్నారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ బాషల్లో సాహో ఒకేసారి ఈ నెల 30న విడుదల కానుంది.