విజయ్ కోసం పూరి రెండు కథలు !

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా ఫిక్స్ అయింది. నవంబర్ నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలవ్వనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మించనుంది. ఇంతకీ విజయ్ ని పూరి ఎలా చూపించబోతున్నాడు ? ఎలాంటి కథని రెడీ చేస్తున్నారనే చర్చ సాగుతోంది. మహేశ్ కోసం పూరి రాసుకొన్న ‘జనగణమన’ కథని విజయ్ తో తీస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, విజయ్ దేవరకొండని ఇస్మార్ట్ గా చూపించబోతున్నాడు పూరి. విజయ్ తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ చేయబోతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి విజయ్ కోసం రెండు కథలు వినిపిస్తున్నాయి. వీటిలో ఏ కథని విజయ్ కోసం పూరి ఎంపిక చేసుకొన్నాడు. ఈ రెండు కాకుండా ఓ కథని రాసుకొన్నాడా ? అన్నది తెలియాల్సి ఉంది. పూరికి కథ రెడీ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఫట్టుమని 15రోజుల్లో కథ మొత్తం పూర్తి చేస్తాడు. కావాల్సిందల్లా.. ఓ ఐడియా మాత్రమే.

ఇక విజయ్ సినిమా బాధ్యత అంతా పూరి ఛార్మిపైనే పెట్టారట. ఇస్మార్ట్ శంకర్ నటీనటులు, టెక్నిషన్స్ ఛార్మినే ఎంపిక చేసింది. ఆ సినిమా హిట్ కావడంతో.. విజయ్ దేవరకొండ సినిమా బాధ్యతలని ఛార్మికే అప్పగించినట్టు సమాచారమ్. ఈ నేపథ్యంలోనే పూరిని ఛార్మి డైరెక్ట్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది.