విలన్ భార్యకు ప్రభాస్ గిఫ్టులు


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మర్యాద రామన్న అని చెబుతుంటారు. తోటి నటులకి బాగా చూసుకొంటారు. మంచి భోజనం పెట్టిస్తారు. సాహో షూటింగ్ సమయంలోనూ హీరోయిన్ శ్రద్దా కపూర్ కి రాజమర్యాదలు చేసినట్టు సమాచారమ్. ఆమె తొలిరోజు షూటింగ్ వచ్చినరోజు రకరకాల వంటలు చేయించారట. షూటింగ్ ప్రతిరోజు శ్రద్దా కోసం ఇంటిభోజనం తెప్పించేవారట.

హీరోయిన్ ని మాత్రమే కాదు.. విలన్స్ ని ప్రభాస్ బాగా చూసుకొన్నారట. ‘సాహో’ సినిమాలో నీల్ నితిన్ ప్రతినాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి నీల్ గొప్పగా చెప్పుకొచ్చాడు. సెట్స్ లో ప్రభాస్ ఎంతో సౌమ్యంగా, వినయంగా ప్రవర్తిస్తుంటారు. అబుదబి షూటింగ్ జరుగుతున్నప్పుడు తన భార్య రుక్మిణి గర్భవతిగా ఉందని ప్రభాస్ కి తెలియడంతో ఆయన తన భార్యని కలిసి చాలా బహుమతులు ఇచ్చారని.. అది చాలా గొప్ప విషయమని చెప్పుకొచ్చాడు.

జీత్ దర్శకత్వంలో ‘సాహో’ తెరకెక్కింది. బాహుబలి తర్వాత టాలీవుడ్ నుంచి రాబోతున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కూడా ఇదే. సాహో కోసం రూ. 350కోట్లు ఖర్చుపెట్టారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండనుందని చెబుతున్నారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ బాషల్లో సాహో ఒకేసారి ఈ నెల 30న విడుదల కానుంది.