మహేష్ పెట్టిన పుల్ల ఈసారి బాగానే కాలింది !

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్3 విజయవంతంగా నాలుగు వారాలని పూర్తి చేసుకొని.. ఐదో వారంలోకి ఎంటరైంది. ఐదోవారం ఎలిమినేషన్ లిస్టులో ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. రాహుల్, హిమజ, అషు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్‌లు ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. ఇక, ఐదోవారం కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం బిగ్ బాస్ మహిళలకి ఇచ్చారు. ఇందుకు సంబంధించి జరిగిన టాస్క్ లో శివజ్యోతి గెలిపొంది.. కెప్టెన్ అయ్యారు.

మరోవైపు మంగళవారం ఏపీసోడ్ లో మహేష్ పెట్టిన పుల్ల బాగా కాలింది. హౌస్‌ సభ్యులకి బిగ్ బాస్ ఒక్కో బిరుదు ఇచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ కి అగ్నిపుల్ల బిరుదు ఇచ్చారు. అంటే.. ఇంటి సభ్యుల మధ్య ఆయన పుల్లులు పెడతారన్నమాట. ఆ విషయాన్ని నాగ్ ముందు మహేష్ ఒప్పుకొన్నారు. అది నా గేమ్ ప్లాన్. ఐతే, తాను పుల్లలు పెట్టేది ఎవరుకి అర్థం కాదు. ఆవి లేటుగా మండుతాయన్నారు. ఐతే, మంగళవారం మహేష్ పెట్టిన పుల్ల అప్పుడే మండింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ?

మంగళవారం ఏపీసోడ్ లో బాబా భాస్కర్ చాలా బాధ పడ్డారని వరుణ్ తో శ్రీముఖి చెప్పడంతో.. వారిద్దరూ కలిసి బాబా, అలీల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. మధ్యలో మహేష్ కల్పించుకుని ఆయన ఫీల్ అయ్యారని అనడంతో నువ్ మధ్యలో పుల్లలు పెట్టకని అలీ ఫైర్ అయ్యాడు. మాటా మాటా పెరిగి పెద్ద గొడవకి దారితీసింది. ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ.. ఒకరి మీదకు మరొకరు కొట్టుకోవడానికి వెళ్లడంలో ఇష్యూ సీరియస్ అయింది.