కౌసల్య గురించి విజయ్ ఏమన్నాడంటే ?

భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఐశ్వర్యా రాజేష్‌, రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. తమిళ్‌ హీరో శివ కార్తికేయన్‌ ప్రత్యేక పాత్రలో మెరవనున్నారు. కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. ఈవారం (ఆగస్టు23) సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ లో సినిమా ప్రీ రిలీజ్ వేడుకని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకి విజయ్ దేవరకొండ-రాశీఖన్నా అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “పెళ్లి చూపులు సినిమా నచ్చి కెఎస్‌ రామారావు,క్రాంతి మాధవ్‌ నన్ను కలిశారు. మనం కలిసి ఓ సినిమా చేద్దాం అన్నారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్ నుంచే ఇక్కడికి వచ్చా. కెఎస్‌ రామారావు ఆరోగ్యం బాగోలేకపోయినా.. ప్రతిరోజు సెట్ కి వస్తారు. సినిమాపై ఆయనకున్న ఫ్యాషన్ అది. ఆయన్ని అందరు డ్యాడీ అని పిలుస్తుంటాం. ఇక, ఐశ్వర్య రాజేష్‌ నటించిన చాలా సినిమాలు చూశాను. మంచి పెర్ఫార్మర్‌. త్వరలో తనతో కలిసి నటించబోతున్నందుకు ఆనందంగా ఉంది. భీమినేనితో సహా ఎంటైర్‌ టీమ్‌కి ఆల్‌దిబెస్ట్‌. ఆగష్టు 23న విడుదలవుతున్న ఈ సినిమా మంచి సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నా”నన్నారు.

అంతేకాదు.. అభిమానులకి విలువైన మెసేజ్ ఇచ్చారు. 2022లో తాగ‌డానికి నీరు కూడా దొర‌క‌ద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. పెట్రోల్‌ని ఎంత పొదుపుగా వాడుతున్నామో నీటిని కూడా అంతే పొదుపుగా వాడుదాం. ప్రభుత్వం నీటిని స‌మృద్దిగా స‌ర‌ఫ‌రా చేసేందుకు ఎన్నో ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుంది. వారికి అండ‌గా మ‌నం నిలుద్దాం అన్నారు విజయ్ దేవరకొండ. హైద‌రాబాద్ మెట్రో పాలిట‌న్ వాట‌ర్ స‌ప్లై అండ్ సివ‌రేజ్‌కి విజ‌య్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్న విష‌యం తెలిసిందే.