బీజేపీలో పచ్చ పుష్పం


బీజేపీలో టీడీపీ నేతలు ఉన్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఇటీవల టీడీపీ ఎంపీలు సుజనా, సీఎం రమేష్ తదితరులు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఐతే, వీరు బీజేపీలో చేరిన టీడీపీ నేతల్లాగే వ్యవహరిస్తున్నారన్నది అంబటి ఆరోపణ. కమలదళంలో, కమల వనంలో ఉన్న పచ్చ పుష్పం సీఎం రమేశ్ సటైర్ వేశారు. ఆయన నిజంగా బీజేపీలోకి వెళ్లారో, లేదా చంద్రబాబు తన కోవర్టుగా పంపించారో కాలమే నిర్ణయిస్తుందని అంబటి అన్నారు.

అమెరికా పర్యటన సందర్భంగా ఏపీ సీఎం జగన్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంపై సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై అంబటి కౌంటర్ ఇచ్చారు. అమెరికాలోని ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారం వొత్తులు, అగ్గిపుల్లల ద్వారా జ్యోతి ప్రజ్వలన చేయడం కుదరదు. ఎలక్ట్రానిక్ వ్యవస్థ ద్వారానే అక్కడ జ్యోతి ప్రజ్వలన చేయగలం. అందుకే జగన్ జ్యోతిని మర్యాదపూర్వకంగా తాకి వెనక్కి వెళ్లి కూర్చున్నారని అంబటి చెప్పారు. కానీ బీజేపీ మాత్రం ‘జగన్ హిందూ వ్యతిరేకి. అమెరికాలో జ్యోతి వెలిగించలేదు’ అని దుమారం లేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.