రామోజీరావుకు అనారోగ్యం ?

రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు (82) అనారోగ్యానికి గురయ్యాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు కొన్ని గంటలుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన్ని ఐసీయూలో చేర్పించారు. వెంటిలేటర్ పై ఉన్నారు. విదేశాల్లో వైద్యానికి ఆయన నిరాకరిస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలోనే ప్రత్యేకంగా ఐసీయూ ఏర్పాటుచేసి మరీ చికిత్స అందిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయ్

మరోవైపు ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని రామోజీ ఫిలింసిటీ వర్గాలు. ప్రస్తుతం రామోజీరావు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, సంస్థ కార్యకలాపాలన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు. ఐతే, ఇదే విషయాన్ని రామోజీ ఫిలింసిటీ వర్గాలు అధికారికంగా చెబితే బాగుండేది. రామోజీ గ్రూప్ నుంచి అలాంటి స్పష్టత ఏదీ రాకపోవడంతో అనుమానాలు పెరుగుతున్నాయి. సొంత మీడియా ద్వారా రామోజీ గ్రూప్ కు చెందిన వ్యక్తులు దీనిపై ప్రకటన ఇస్తే బాగుంటుంది.