బొత్స మళ్లీ.. అదే మాట !


ఏపీ రాజధాని అమరావతి విషయంలో మంత్రి బొత్స మరోసారి అవే మాటలు చెప్పారు. ఇటీవల అమరావతిపై బొత్స కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాజధాని విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరలోనే దీనిపై ప్రభుత్వం తీసుకోనుంది. అమరావతి అంత సురక్షితం కాదని బొత్స చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలని హీటెక్కించాయి. తాజాగా విజయనగరంలో విలేకరులతో మాట్లాడిన బొత్స తాను చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. రాజధాని విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు.

ఇక రాజధాని విషయంలో జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలు ద్వంద్వ వైఖరిలా ఉన్నాయని బొత్స ఆరోపించారు. రాజధాని ప్రాంతానికి వరద ముంపు ఉందని, గత ప్రభుత్వం శివరామకృష్ణ కమిటీ సలహాలపై నిర్లక్ష్యం వహించిందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతిలో రాజధాని నిర్మాణం ఆర్థిక భారమవుతుందని పునరుద్ఘాటించారు. మాజీ సభాపతి కోడెల విషయంపై స్పందించిన బొత్స.. చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు.