పవన్ కల్యాణ్ పేరిట పచ్చి మోసం

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు కానుకగా సోమవారం అభిమానులు తీపికబురు చెప్పారు. ఆయన సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇందుకోసం జనసేన అధ్యక్ష పదవిని కూడా వదులుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ మేరకు పవన్ పేరిట ఓ లేఖ విడుదలైంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐతే, ఆ లేఖ మోసపూరితమైందని తెలుపుతూ.. జనసేన పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు జనసేన ట్విట్టర్ ఖాతాలో ఓ ప్రెస్ నోట్ ద్వారా వివరణ ఇచ్చారు.

“జనసేన శ్రేణులు, అభిమానులు పవన్ కల్యాణ్ బర్త్ డే వేడుకలని ఘనంగా నిర్వహించడం, సేవా కార్యక్రమాలని చూసి ఓర్వలేని కొందరు పవన్ కల్యాణ్ పేరిట తప్పుడు లేఖని సృష్టించినట్టు పార్టీ దృష్టికి వచ్చింది. ఆ లేఖ పచ్చి మోసపూరితమైనది. పవన్ తన పదవులని వదులుకొని సినిమాల్లోకి వస్తున్నారని కట్టుకథలతో కూడిన లేక అది. ఇలాంటి అసత్య అంశాలని ఎవరు నమ్మవద్దు. తప్పుడు లేఖని సృష్టించి సర్కిలేట్ చేస్తున్న వారిపై కేసు నమోదు చేసి లీగల్ ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. పార్టీ లీగల్ విభాగం ఇందుకు సంబంధించిన చర్యలని ప్రారంభిస్తుంది. రాజకీయ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు ఒక భాగం మాత్రమే. నిరంతరం ప్రజలకి చేరువగా ఉండి.. ప్రజల ప్రక్షాణ నిలవడమే తన బాధ్యతని అని పవన్ నమ్ముతున్నారు. అందుకు అనుగుణంగా పవన్ ప్రజాక్షేతంలోనే ఉంటున్నారు” జనసేన లేఖలో తెలిపింది.