లోకేష్’కు ఘోర అవమానం

తెదేపా యువ నాయకుడు నారా లోకేష్ కు ఘోర అవమానం జరిగింది. ఇప్పటికే లోకేష్ పై పప్పు అనే ముద్రపడిపోయింది. దాన్ని బయటపడటానికి నానా తంటాలు పడుతున్నారాయన. ట్విట్టర్ వేదికగా తన తెలివినంత చూపించడానికి ట్రై చేస్తున్నారు. దాంతో ఆయనపై ట్విట్టర్ బాబు అనే ముద్రపడిపోయింది. ఇదీగాక లోకేష్ సీనియర్లకు సరైన గౌరవ-మర్యాదలు ఇవ్వరనే ప్రచారం ఉంది. దాని నుంచి బయటపడేందుకు సీనియర్ ఇంట్లో వేడుకలు, బర్త్ డే వేడుకలకి హాజరవ్వడం అలవాటు చేసుకొన్నాడు చిన్నబాబు.

ఇందులో భాగంగానే ఆయన ఇవాళ నర్సిపట్నం వెళ్లారు. తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లారు. ఐతే అక్కడ లోకేష్ కి షాక్ తగిలింది. కాదు.. కాదు పరువుపోయింది. లోకేష్ నర్సిపట్నం వెళ్లిన ఈరోజునే అయ్యన పాత్రుడు తమ్ముడు, న ర్సీపట్నం టీడీపీ అధ్యక్షుడు సన్యాసిపాత్రుడు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే వైకాపాలో చేరబోతున్నట్టు సమాచారమ్. ఈ నేపథ్యంలో లోకేష్ ది ఐరన్ లెగ్ ఆయన ఎక్కడికి వెఌతే అక్కడ మసి అని వైకాపా శ్రేణులు కామెంట్స్ చేస్తున్నారు. లోకేష్ నర్సిపట్నం వచ్చిననాడే సన్యాసిపాత్రుడు రాజీనామా వెనక వైసీపీ ఉందని టాక్.