జనసేనపై నటి షాకింగ్ కామెంట్స్

సినీ, రాజకీయ విశ్లేషకుడు కత్తి మహేశ్ పై గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నటి సునీత గుర్తుందా.. ? ఆమె మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ సారి ఆమె గీతా ఆర్ట్స్, జనసేన పార్టీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. నిర్మాత బన్నీవాసు, జనసేన పార్టీ తనని మోసం చేసింది. జనసేన కోసం పని చేస్తే ఆదుకుంటామని చెప్పారు. సినిమా ఛాన్స్ లు ఇప్పిస్తామని బన్నీవాసు మోసం చేశారు. ఇప్పుడేమో తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని మంగళవారం రాత్రి ఫిల్మ్ చాంబర్ వద్ద నిరసనకి దిగింది. తనకి తాను తాళ్లతో కట్టుకొనే నిరసన చేపట్టింది. ఈ వ్యవహారంపై నిర్మాత అల్లు అరవింద్ స్పందించాలని సునీత డిమాండ్ చేసింది.

ప్రస్తుతం సునీతని పోలీసులు విచారణలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె ఆరోపణల్లో నిజమెంత ? తెలుసుకొనేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారమ్. ఇక సునీత ఆరోపణలపై ఇప్పటి వరకు గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి గానీ, జనసేన పార్టీ తరుపున కానీ ఎవరు స్పందించలేదు. సునీత ఆరోపణలు మాత్రమే చేస్తుంది. ఆమె వద్ద ఎలాంటి రుజువులు లేవని చెబుతున్నారు. ఇదంతా పబ్లిసిటీలో బాగంగానే ఆమె చేస్తుందా ? నిజంగానే ఆమెని జనసేన పార్టీ కోసం వాడుకొన్నారా ? అనేది తెలియాల్సి ఉంది.