భాజాపాలో చేరిన రేవూరి

తెలంగాణలో భాజాపాలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా తెదేపా సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి భాజాపా తీర్థం పుచ్చుకొన్నారు. ఢిల్లీలో భాజాపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో రేవూరి భాజాపాలో చేరారు.

రేవూరితో పాటుగా కాంగ్రెస్ మాజీ ఎంపీ రవీంద్రనాయక్ కూడా భాజాపాలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భాజాపా అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం లేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని హితవుపలికారు. రాష్ట్రంలో యూరియా కొరతను సీఎం ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. సరిపడా యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదనేది అవాస్తవమన్నారు.