‘సైరా’ ప్రమోషన్ బాధ్యత పవన్ దే !

సాహో సందడి ఇక ముగిసినట్టే. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని అలరించని సాహో లెక్కలు తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఈలోగా టాలీవుడ్ నుంచి మరో భారీ బడ్జెట్ రాబోతుంది. సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచేందుకు చిత్రబృందం ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా త్వరలోనే ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించనున్నారు.

కర్నూలు ప్రాంతానికి చెందిన తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా’ తెరకెక్కింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకని కర్నూలులో ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇక ఈ వేడుకకి బిగ్ బీ మెగాస్టార్ ని తీసుకురావాలని అనుకొన్నారు. కానీ అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆయన ఇక్కడి రాలేరు. బాలీవుడ్ ప్రమోషన్స్ లో బిగ్ బీ పాల్గొననున్నారు. దీంతో సైరా ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని తీసుకురానున్నట్టు తెలుస్తోంది.

ఈ చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన గురువు పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటించారు. నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, కిచ్చ సుధీప్, విజయ్ సేతుపతి, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 250కోట్ల బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ నిర్మించారు.