జగన్ కేసు నిందితుడు సంచలన ఆరోపణలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ దాడి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. ఐతే, జైలులో శ్రీనివాసరావుని అధికారులు కొడుతున్నారు. ఆత్మహత్య చేసుకోవాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారని ఆయన తరుపు న్యాయవ్యాది అబ్దుస్ సలీం తెలిపారు. బుధవారంనాడు జైలు అధికారులు శ్రీనివాసరావుని కొట్టారు. ఆయన క్రింద దవడ, పెదవిపై గాయాలయ్యాయి. జైలు ఆవరణలోని చెట్టు నుంచి బొప్పాయి దొంగిలించావని చెప్పి శ్రీనివాసరావును జైలర్, వార్డెన్ కొట్టినట్లు ఆయన తెలిపారు.

రాజమండ్రి జైలులో శ్రీనివాసరావుకి ప్రాణహాని ఉందని.. ఆయన్ని వేరే జైలుకి మార్చాలని న్యాయవాది కోరారు. గత యేడాది విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జగన్ పై కోడికత్తితో శ్రీనివాసరావు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్నాళ్లు బెయిల్ పై బయటికొచ్చిన శ్రీనివాసరావు.. తాను జగన్ అభిమానిని.. ఫోటో దిగడానికి దగ్గరవెలితే.. ప్రమాదవశాత్తు కత్తి తగిలిందని తెలిపిన సంగతి తెలిసిందే.