ఏపీ గ్రామ సచివాలయ పరీక్ష తుది ‘కీ’ విడుదల

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి ఆదివారం (సెప్టెంబర్ 1) నుంచి పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా గ్రామ సచివాలయం కేటగిరీ -1 పరీక్ష తుది కీ విడుదలైంది. ఈ పరీక్షపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం తుది కీని శనివారం సాయంత్రం అధికారులు విడుదల చేశారు. పరీక్ష రాసిన అందరికీ రెండు మార్కులు ప్రశ్నాపత్రంలో తప్పుల కారణంగా రెండు ప్రశ్నలకు అదనంగా మార్కులు కలపాలని నిర్ణయించారు. ఒక ప్రశ్నకు సమాధానం లేకపోవడం, మరో ప్రశ్నలో అనువాద దోషం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ కీని వెబ్ సైట్ లో ఉంచినట్టు అధికారులు తెలిపారు.