‘నిశ్శబ్దం’ ఫస్ట్ లుక్ వచ్చేసింది !

‘భాగమతి’ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని స్వీటీ అనుష్క నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకుడు.
ఇందులో మాధవన్, షాలిని పాండే, అంజలి, సుబ్బరాజ్, హాలీవుడ్ నటుడు మైఖేల్ మడిసెన్ కీలక పాత్రలు చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.

పోస్టర్ పై ‘సాక్షి ఎ మ్యూట్ ఆర్టిస్టు’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఫారిన్ లొకేషన్స్ లో ఓ నది ఒడ్డున కూర్చొని స్వీటీ అనుష్క బొమ్మని గీస్తున్న పోస్టర్ ని ఫస్ట్ లుక్ లో వదిలారు. ఇందులో స్వీటీ నాజుకు లుక్ లోనే కనిపిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ బాషల్లో ఒకేసారి ఫస్ట్ లుక్ ని విడుదల చేయడం విశేషం. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ యుఎస్ లో పూర్తి చేసుకొంది. త్వరలోనే రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. యుఎస్ షెడ్యూల్ కి సంబంధించిన పిక్ నే ఫస్ట్ లుక్ గా వదిలారు.