ప్రభాస్ ప్రేమకథ కాస్ట్లీ గురూ.. !


‘సాహో’ సందడి దాదాపు ముగిసినట్టే. దీంతో ప్రభాస్ తదుపరి సినిమాపై ఫోకస్ పెరిగింది. ‘జిల్’ దర్శకుడు రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. ఇదో ప్రేమకథా చిత్రమ్. 1970 బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. ఇప్పటికే ఒకట్రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇది కూడా భారీ బడ్జెట్ సినిమాయే. దాదాపు రూ. 180కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం 25 సెట్స్ వేస్తున్నారట. ఇందులో కొన్ని కాస్ట్లీ సెట్స్ ఉన్నాయని తెలుస్తోంది.

ఈ చిత్రం కోసం ‘జాన్’ టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ యేడాదియే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో జాన్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక, ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఏ దర్శకుడితో జతకడతారనేది ఆసక్తిగా మారింది. కేజీఎఫ్2 దర్శకుడు ప్రశాంత్ నీల్, పూరి జగన్నాథ్ పేర్లు ప్రభాస్ తదుపరి సినిమా కోసం వినిపిస్తున్నాయి. ఐతే, ఈ సారి ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమా కాకుండా రొమాంటి, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ చేయాలని ఆశపడుతున్నట్టు తెలుస్తోంది.