మహర్షి రచయితతో నాగ్ సినిమా ?

వంశీపైడి పల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా కథని సోలోమన్ తో కలిసి వంశీ రాశారు. సినిమా ఫలితంలో సోలోమన్ కి క్రెడిట్ ఇచ్చారు. ఇప్పుడది పనికొచ్చినట్టు కనిపిస్తోంది. ఇటీవలే సోలోమన్ కింగ్ నాగార్జునకి ఓ కథ చెప్పినట్టు తెలుస్తోంది. అది నాగ్ కి నచ్చింది. సోలోమన్ కే దర్శకత్వం బాధ్యతలు అప్పగించాలని నాగ్ భావిస్తున్నారంట. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు సాద్యాసాధ్యాలపై డిస్కషన్లు సాగుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుంది.

ఈ చిత్రాన్ని నాగ్ సన్నిహిత బ్యానర్ మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మించే అవకాశం వుంది. ఇదిలావుంటే.. ‘బంగార్రాజు’ ప్రాజెక్ట్ ఇంకా నానుతూనే ఉంది. ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లాలంటే చైతూ ఫ్రీ కావాలి. ప్రస్తుతం చైతూ వెంకీ మామతో బిజీ. చైతూ ఫ్రీ అయితే నాగ్ బిజీ అవుతున్నారు. ఇలా అయితే బంగార్రాజు వచ్చేది ఎప్పుడో తెలియడం లేదు. కల్యాణ కృష్ణని మాత్రం చాన్నాళ్ల నుంచి ఖాళీగా ఉంచుతున్నారు. ఆ మధ్యలో ‘నేల టికెట్’ తీసి చేతులు కాల్చుకొన్నాడు.. ఈ దర్శకుడు.