‘సైరా’ వేడుక.. కేటీఆర్ రావట్లేదు.. !

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా’. తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2న ‘సైరా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 18 హైదరాబాద్ లోని ఎల్భీ స్టేడియంలో సైరా ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించనున్నారు. ఈ వేడుకకి అతిథులుగా తెలంగాణ మంత్రి కేటీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, వి.వి. వినాయక్ హాజరు కానున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కేటీఆర్ రావడం లేదని క్లారిటీ ఇచ్చింది. కేటీఆర్ కూడా హాజరు కావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నారని చిత్రబృందం తెలిపింది.

ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య సైరా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరుగుతోంది. సైరా ఓవర్సీస్ రైట్స్ రూ. 15కోట్లకి అమ్ముడుపోయాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి సొంతం చేసుకొంది.  తెలుగు, హిందీ, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. హిట్ టాక్ వస్తే మాత్రం సైరా బాహుబలి పేరిట ఉన్న కొన్ని రికార్డులని బద్దలుకొట్టే ఛాన్స్ ఉంది.