2 వారాలు.. రూ. 424కోట్లు !

బాక్సాఫీస్ దగ్గర ‘సాహో’ హవా కొనసాగుతోంది. రెండు వారాల్లో రూ. 424కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిందని నిర్మాత సంస్థ యూవీ క్రియేషన్స్ ట్విట్ చేసింది. వాస్తవానికి ‘సాహో’ బాహుబలి రికార్డులని బద్దలు కొడుతుందని భావించారు. తెలుగులో రూ.100కోట్లకి పైగా.. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 (రూ. 1800కోట్లకిపైగా) రికార్డులని బద్దలు కొడుతుందని, ఇకపై నాన్ బాహుబలి పదం వినిపించదని ఆశించారు. కానీ సాహో మిక్సిడ్ టాక్ మూటగట్టుకొంది. కేవలం ప్రభాస్ కి గల క్రేజ్ తో టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు, తొలివారం కలెక్షన్స్ బాగున్నా.. ఆ తర్వాత భారీగా పడిపోయాయ్. 

ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించింది. ఓ ప్రత్యేక గీతంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మెరిసింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ దాదాపు రూ. 350కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది