పండగ ఆఫర్స్’పై అభ్యంతరాలు

పండగొచ్చిందంటే.. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయ్. దసరా, దీపావఌ, క్రిస్మస్, న్యూ ఇయర్, ఉగాధి, ఆషాడం.. ఇలా స్పెషల్ ఆఫర్స్ ని ప్రకటిస్తుంటాయి. ఇకపై వీటిని నిషేదించాలని సీఏఐటీ (వ్యాపార సంఘం కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్) ప్రభుత్వాన్ని  కోరింది. ఆ సంస్థలు అందిస్తున్న ఆఫర్ల వల్ల స్థానిక వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలకు పూర్తి విరుద్ధం అని తెలిపారు.

ఈ-కామర్స్ సంస్థలు 10శాతం నుంచి 80శాతం డిస్కౌంట్లు ప్రకటించడం వల్ల విపణిలో వస్తువుల ధరల్లో తీవ్ర అంతరం ఏర్పడుతోంది. నిబంధనలకు ఇది పూర్తి విరుద్ధం అని కేంద్రానికి రాసిన లేఖలో సీఏఐటీ పేర్కొంది. దసరా, దీపావళి పండగలను పురస్కరించుకొని ఈ-కామర్స్ సంస్థలు ఫెస్టీవ్ సీజన్ ఆఫర్ల పేరిట భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. సెప్టెంబర్ 29 నుంచి ఆరురోజుల పాటు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరిట భారీ డిస్కౌంట్లను ప్రకటించిన విషయం తెలిసిందే.