విజయశాంతిని భయపెట్టిన మహేష్


లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న చిత్రమిది. దాదాపు 11యేళ్ల తర్వాత విజయశాంతి నటిస్తున్న చిత్రమిది. ముందు విజయశాంతి చాలా భయపడ్డారట. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని తెలిపారు.

సినీ పరిశ్రమలో చాలా మార్పులు జరిగాయి. ఇది నాకు పూర్తిగా కొత్తగా అనిపించింది. చిన్నపిల్లలు మొదటిసారి బడికి వెళ్లినప్పుడు ఎలా ఉంటుందో నాకు అలాగే ఉందన్నారు. ఇక ఈతరం కథానాయికలపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రోజుల్లో మేము అవసరమైతే 24 గంటలు పని చేసేవాళ్లం. యేడాది 17-18సినిమాలు చేసేవాళ్లం. ఈ తరం హీరోయిన్స్ యేడాదికి రెండు లేక మూడు సినిమాలు మాత్రమే చేస్తున్నారు. ఇప్పటి కథానాయికలు ఆకట్టుకునేలా చేయడం నేను చూడలేదన్నారు.