ధవళేశ్వరానికి కొట్టుకొచ్చిన 2 మృతదేహాలు


తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద 70మందితో ప్రయాణిస్తున్న బోటు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ బోటు ప్రమాదానికి సంబంధించి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెండు మృతదేహాలు ధవళేశ్వారానికి కొట్టుకొచ్చాయి.ఇవాళ ఉదయం ధవళేశ్వరం బ్యారేజీ రెండు మృతదేహాలు లభ్యం కాగా, మరో మృతదేహాం కచ్చులూరు సమీపంలో లభించింది.దీంతో బోటుప్రమాదంలో ఇప్పటి వరకు బయటపడిన మృత దేహాల సంఖ్య 11కి చేరింది. మరోవైపు, బోటు ప్రమాదానికి సంబంధించి మూడో రోజు గాలిపంపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బందితోపాటు నేవీకి చెందిన సైనికులు కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాద స్థలిలో సుడులు ఎక్కువగా ఉండటం వల్ల గాలింపు చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇవాళ ఉత్తరాఖండ్ నుంచి 30 సభ్యులు గల ప్రత్యేక బృందం సహాయచర్యల్లో పాల్గొనేందుకు రానుంది.