రెండో టీ20 : టీమిండియా టార్గెట్ 150 రన్స్ 


మొహాలీ వేదికగా జరుగుతున్న రెంటో టీ20 మ్యాచ్ లో టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. సౌతాఫ్రికా కెప్టెన్ డికాక్ ఆరంభంలో దూకుడుగా ఆడటంలో 10 ఓవర్లలో 78పరుగులు చేసింది. ఐతే, ఆ తర్వాత టీమిండియా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో పరుగులు రాబట్టడం సఫారీలు బ్యాట్స్ మెన్స్ ని కష్టంగా మారింది. ఐతే, సైని వేసిన ఆఖరి ఓవర్లో మాత్రం ఏకంగా 16పరుగులు వచ్చాయ్. భారత బౌలర్లలో  చాహర్ 2, సైనీ, జడేజా, హార్దిక్ పాండ్య ఒక్కో వికెట్ తీశారు.