మళ్లీ వంశీతోనే !

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. రష్మిక మందన హీరోయిన్. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. దిల్ రాజు-రామబ్రహ్మాం సుంకర్-మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మహేష్ సినిమా ఉండబోతుంది. ఇటీవలే నీల్ మహేష్ ని కలిసి కథ చెప్పాడు. మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే ప్రచారం జరుగుతోంది. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ? మహేష్ తదుపరి సినిమా వంశీ పైడిపల్లితో ఉండనుంది. వీరి కలయికలో వచ్చిన ‘మహర్షి’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతకుమించి మహేష్ కి పిచ్చ పిచ్చగా నచ్చేసిన సినిమా. ఈ సినిమా సమయంలోనే వంశీతో మరో సినిమా చేస్తానని మహేశ్ ప్రకటించారు.

అది సరిలేరు నీకెవ్వరు తర్వాతే ఉండబోతుందని సమాచారమ్. ఇటీవలే వంశీ చెప్పిన ఓ లైన్ ని మహేష్ ఓకే చేశాడట. దీంతో స్క్రిప్ట్ పనులు పూర్తి చేసే పనిలో వంశీ ఉన్నాడట. వాస్తవానికి ప్రశాంత్ నీల్ మహేష్ కంటే ముందు ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలి. ఆ తర్వాత మహేష్ తో సినిమా ఉండనుంది. ఈ లోపు వంశీ దర్శకత్వంలో మరో సినిమా చేయాలని మహేష్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.