సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్.. లెటెస్ట్ అప్ డేట్స్ ! 


ఈ నెల 18న జరగాల్సిన సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ 22కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇందుకు వర్షాల రాకనే కారణమని సమాచారమ్. ఇదీగాక 18న తెలంగాణ మంత్రి కేటీఆర్ అందుబాటులో లేరు. ఆయన కోసం ఫంక్షన్ ని 22కి వాయిదా వేశారనే ప్రచారం ఉంది. ఐతే, ఆదివారం సైరా ఫంక్షన్ కి కేటీఆర్ వస్తారా ? అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు.

ప్రస్తుతం సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం హైదరాబాద్ ఎల్భీ స్టేడియంలో వేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ ఉదయం ఎండరావడంతో మైదానం ఆరేందుకు చర్యలు తీసుకొన్నారు. ఇక ఈ ఫంక్షన్ కి పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా హీరోలు, మెగా ఫ్యామిలీ అంతా హాజరుకాబోతున్నారు. మరోసారి మెగా హీరోలందరినీ ఓకే వేదికపై చూసే అవకాశం మెగా హీరోలకి కలగనుంది.
 
సురేంద రెడ్డి దర్శకత్వంలో సైరా తెరకెక్కింది. తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, కిచ్చ సుధీప్, విజయ్ సేతుపతి, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ నిర్మించారు. అక్టోబర్ 2న సైరా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.