సా॥ 5గంటలకు శివప్రసాద్ అంత్యక్రియలు

తెదేపా సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎంపీ ఎన్ .శివప్రసాద్ (68) మూత్రపిండ సంబంధిత వ్యాధిలో చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలను ఇవాళ సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నారు. చిత్తూరు జిల్లా ఐతేపల్లి వద్ద అరగాలలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
 
ప్రస్తుతం శివప్రసాద్ పార్థీవ దేహాన్ని కార్యకర్తల సందర్శనార్థం తిరుపతిలోని ఆయన నివాసంలో ఉంచారు. సాయంత్రం 4 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. తెదేపా అధినేత చంద్రబాబు శివప్రసాద్ అంతిమయాత్రలో పాల్గొననున్నారు. శివప్రసాద్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.