వేణు మాధవ్-షకీల ఒకే రూమ్ లో ఒకే బెడ్ పై.. ఆ తర్వాత ఏం జరిగిందంటే ?

హాస్యనటుడు వేణు మాధవ్ నవ్వులు అర్థాంతరంగా ఆగిపోయాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం కన్నుమూశారు. వేణు మాధవ్ మృతిని ఆయన సన్నిహితులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని ఓసారి గుర్తు చేసుకొంటూ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. నటి షకీలతోనూ వేణుమాధవ్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో గతంలో షకీల ఓ ఇంటర్వ్యూలో వేణు మాధవ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఇంతకీ వేణు మాధవ్ గురించి షకీల ఏం చెప్పారంటే.. ? 

ఒక సినిమా షూటింగ్ నిమిత్తం షకీల ,వేణు మాధవ్,రఘు బాబు,బ్రహ్మానందం ఒక హోటల్లో బస చేశారట.  అందరు కలిసి షకీల రూమ్ లోనే కూర్చోని జోక్స్ వేసుకొంటున్నారట. వాళ్ల చేష్టలకి షకీల గది గందరగోళంగా తయారైందట. దాంతో ఆ రాత్రి వేణు మాధవ్ గదిలోనే.. ఆయనతో కలిసి ఒకే బెడ్ పై పడుకుందట. కాసేపటికి వేణు మాధవ్ హస్కీ వాయిస్‌తో. నేనో విషయం అడగనా.. అంటూ మొదలెట్టాడట. దీంతో షకిలాకి భయపడిపోయిందట. కానీ వేణు మాధవ్ ఏమన్నాడో తెలుసా..  నాకు పెళ్లయి ఇద్దరు బిడ్డలు ఉన్నారని తెలుసు కదా. ఒకవేళ నిద్రలో నువ్వు నీ కాలు గనుక నాపై వేస్తే అంతే సంగతి. కాబట్టి నువ్వు కాలు వేసుకోవాలనుకుంటే.. పిల్లోపై వేసుకో అంటూ ఇద్దరి మధ్య పిల్లో పెట్టారట. ఆ సమయంలో వేణుని చూసి ఇదీ ఫ్రెండ్‌షిప్ అంటే అనుకున్నానని ఓ ఇంటర్వ్యూలో షకీల చెప్పారు.