కొరియా ఓపెన్‌ : క్వార్టర్ కి దూసుకెళ్లిన కశ్యప్


కొరియా ఓపెన్‌ లో భారత షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ అదరగొడుతున్నాడు. క్వార్టర్ ఫైనల్ కి చేరాడు. ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో మలేషియా షట్లర్‌ డారెన్‌ లియూపై కశ్యప్‌ విజయం సాధించాడు. డారెన్‌ లియూపై 21-17, 11-21, 21-12 తేడాతో కశ్యప్‌ గెలుపొందాడు. తొలి గేమ్‌ను సొంతం చేసుకున్న కశ్యప్‌.. రెండో గేమ్‌లో తడబడ్డాడు. మూడో గేమ్‌లో పుంజుకుని క్వార్టర్‌ ఫైనల్స్‌కి చేరాడు. 56 నిమిషాల పాటు హోరాహోరీగా ఈ మ్యాచ్‌ సాగింది. కశ్యప్‌ తర్వాతి మ్యాచ్ ఇండోనేసియాకు చెందిన ఆంటోనీ సినిసుకాతో తలపడనున్నాడు.