వేణుమాధవ్‌ అంతిమయాత్ర ప్రారంభం


వేణుమాధవ్‌ అంతిమయాత్ర ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ఛాంబర్‌ నుంచి మౌలాలీ వరకు యాత్ర కొనసాగనుంది. మౌలాలీ శ్మశాన వాటికలో వేణుమాధవ్‌ అంత్యక్రియలను నిర్వహించనున్నారు. అంతకు ముందు వేణు మాధవ్ మృతదేహాన్ని అభిమానుల సందర్శణార్థం ఫిల్మ్ ఛాంబర్ కి తరలించారు. అక్కడ దాదాపు రెండు గంటలపాటు ఉంచారు. ప్రముఖ సినీనటులు చిరంజీవి, మురళీమోహన్‌ తదితరులు వేణుమాధవ్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హాస్యనటుడు వేణు మాధవ్ గురువారం సికింద్రాబాద్ యశోద హాస్పటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.  ణుమాధవ్ ఇప్పటివరకు 600 సినిమాల్లో నటించారు. తొలిప్రేమ, దిల్, లక్ష్మి, సై, ఛత్రపతి చిత్రాలు మంచిపేరు తీసుకొచ్చాయి. 2006లో లక్ష్మి సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు.