అలీ రెజా రీ-ఎంట్రీ ఇచ్చేశారు !


బిగ్ బాస్ మరో సప్రైజ్ ఇచ్చారు. దీన్ని సప్రైజ్ అనడం కన్నా.. ప్రచారాన్ని నిజం చేశారని చెప్పవచ్చు. బిగ్ బాస్ హౌస్ లోకి అలీ రెజా రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు గత కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ప్రచారం నిజమైంది. అలీ ఈరోజు (గురువారం) ఏపీసోడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోని స్టార్ మా విడుదల చేసింది. ఐతే, ప్రోమో అలీ రెజా కనిపించలేదు. కానీ ఎవరో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారనే మూడ్ మాత్రమే చూపించారు. అది అలీ ఫ్యాన్స్ మాట.

ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ నుంచి హేమ, జాఫర్‌, తమన్నా, రోహిణి, అషూరెడ్డి, అలీ రెజా, శిల్ప చక్రవర్తి, హిమజలు ఎలిమినేట్‌ అయ్యారు. ఐతే వీరిలో ఒకరిని రీ ఎంట్రీ ఇప్పించే అవకాశం ఉంది. గత రెండు సీజన్ లోనూ అదే జరిగింది. ఐతే, ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన వారిలో అలీ రెజాకు అత్యధిక ఓట్లు వచ్చాయ్. దీంతో ఆయన ఈరోజు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాం. ఈ న్యూస్ కన్ఫామ్. అలీ బొమ్మ కనబడటమే తర్వాయి అని చెబుతున్నారు. మరీ..  రీ ఎంట్రీతో అలీ రెచ్చిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.