వరుణ్ తేజ్ కి బాలయ్య ఫ్యాన్స్ ఝులక్ !


ఏపీ అసెంబ్లీ ఎన్నికలకి ముందు మెగా బ్రదర్ నాగబాబు నందమూరి బాలయ్యని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. బాలయ్యపై వెటకారపు మాటలు వదిలారు. ఇప్పుడు బాలయ్య అభిమానులు రివెంజ్ తీర్చుకొన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. గత శుక్రవారం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్ టూర్ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా బుధవారం గుంటూరులోని VVIT క్యాంపస్‌కు వెళ్లారు వెళ్లారు.  

అక్కడ వరుణ్ తేజ్ మాట్లాడుతుండగా.. స్టూడెంట్స్ అందరూ ఒక్కసారిగా ‘జై బాలయ్య.. జైజై బాలయ్య’ అంటూ స్లోగన్స్ ఇచ్చారు.  దీంతో వరుణ్ తేజ్ ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయాడు  సినిమా యూనిట్‌కి కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. కొద్దిసేపు ‘జై బాలయ్య’ నినాదాలతో క్యాంపస్ హోరెత్తిపోయింది. దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేశారు బాలయ్య ఫ్యాన్స్. ఇది కచ్చితంగా రివెంజ్ అని తండ్రి నాగబాబుపై ఉన్న కసిని తనయుడు వరుణ్ తేజ్ పై తీర్చుకొన్నట్టు కనిపిస్తోంది. బహుశా.. మెగా ఫ్యాన్స్ కూడా దీనికి కౌంటర్ ఇస్తారనుకోండి. దానికి సమయం రావాలి… !