అత్తారింటికి.. ఆరేళ్లు !


టాలీవుడ్ కి వందకోట్ల దారి చూపిన చిత్రం అత్తారింటికి దారేది. రిలీజ్ కి ముందే సగం సినిమా లీకైన సత్తా చూపిన సినిమా. త్రివిక్రమ్-పవన్ కల్యాణ్ కాంబో ప్రత్యేకతని చాటి చెప్పిన సినిమా. 2013 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన అత్తారింటికి దారేది సంచలన విజయం అందుకుంది. నేటితో అత్తారింటికి.. ఆరేళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఆ సినిమా తాలుకు తీపి జ్ఝాపకాలని గుర్తు చేసుకొంటున్నారు పవన్ అభిమానులు

త్రివిక్రమ్-పవన్ కలయిక ఎప్పుడూ ప్రత్యేకమే. వీరిద్దరు కలిసి జల్సా చేశారు. పవన్ తీన్మార్ కి త్రివిక్రమ్ మాటలు అందించారు. ఇక అత్తారింటికి దారేదితో ఇండస్ట్రీకి వందకోట్ల దారి చూపించారు. వీరి కలయికలో వచ్చిన ఆఖరి చిత్రం అజ్ఝాతవాసి అట్టర్ ప్లాప్ అయింది. అయినా.. త్రివిక్రమ్-పవన్ కలయికలో మరో సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పవన్ రీ ఎంట్రీ ఇప్పించే బాధ్యత త్రివిక్రమ్ దేనని మెగా అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే.. త్రివిక్రమ్ పట్టుబడితే పవన్ కాదనరు.