గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 21మంది మృతి !


గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బనస్కాంతా జిల్లా అంబాజీ పట్టణ సమీపంలో త్రిశూల్‌ ఘాట్‌ వద్ద ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈఘటనలో దాదాపు 21 మంది మరణించగా, 50 మంది గాయాల పాలయ్యారు. ప్రమాదం జరిగిన బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు.