అభిమానులకి సారీ చెప్పిన చరణ్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకి సారీ చెప్పారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి ఈ వారమే (అక్టోబర్ 2) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది సైరా చిత్రబృందం. ఇందులో భాగంగా ఆదివారం బెంగళూరులో సైరా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకి అనుకున్న దానికంటే అధికసంఖ్యలో అభిమానులు రావడంతో హాల్‌లో స్థలం సరిపోలేదు. దీంతో చాలా మంది అభిమానులు బయటే ఉండాల్సి వచ్చింది.

దీనిపై రామ్ చరణ్ స్పందించారు. అభిమానులకి క్షమాపణలు చెబుతూ.. ఓ వీడియోని  ఇస్ట్రోగ్రామ్ లో పోస్ట్ చేశారు చరణ్. “బెంగుళూరులో నిన్న జరిగిన ‘సైరా’ ప్రీరిలీజ్‌ వేడుకకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. హాల్‌ ఖాళీలేకపోవడంతో చాలామంది అభిమానులు బయటే ఉండాల్సి వచ్చింది. అందుకు మమ్మల్ని క్షమించండి. మీ ప్రేమే మాకు బలం. అక్టోబర్‌2న ‘సైరా’ చిత్రం థియేటర్లలోకి వస్తుంది. లవ్‌ యూ ఆల్‌” చరణ్ తెలిపారు.