‘సైరా’పై మోహన్ బాబు ట్విట్ !

దేశంలో సైరా మేనియా మొదలైపోయింది. సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టా చిరంజీవి నటించిన చిత్రమిది. తొలితరం స్వాత్రంత్య్ర సరమయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య సైరా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకంటే ముందే ఈ రాత్రికే ఓవర్సీస్ లో సైరా ప్రీమియర్ షోస్ పడిపోనున్నాయ్. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, సైరా చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్విట్ చేస్తున్నారు. తాజాగా డైలాగ్  కింగ్ మోహన్ బాబు సైరాపై ట్విట్ చేశారు.

“నా మిత్రుడు చిరంజీవి మంచి నటుడు, తన కుమారుడు చరణ్ అధిక వ్యయంతో తీసిన సినిమా సైరా. ఇది అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని నిర్మాత చరణ్ కు, చిరంజీవి కి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు తేవాలని మనసా వాచా కోరుకుంటున్నాను. Best of Luck!” అంటూ రాసుకొచ్చారు.

ఈ చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరు, ఆయన గురువు పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటించారు. నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు. రామ్ చాన్ నిర్మిసంచారు. సాహో తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న ప్యాన్ ఇండియా సినిమా ఇది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4600 థియేటర్స్ లో సైరా రిలీజ్ కానుంది.