బై బై ఇవంకా !

ఇవాంక ట్రంప్‌ రెండ్రోజుల హైదరాబాద్ పర్యటన ముగిసింది. దీంతో బుధవారం రాత్రి ఆమె అమెరికాకు బయలుదేరి వెళ్లింది. రెండు రోజుల హైదరాబాద్ పర్యటనని ఇవంకా బాగా ఎంజాయ్ చేసినట్టు యుఎస్ ప్రతినిథులు చెప్పినట్టు తెలుస్తోంది. ఇవంకా హైదరాబాద్ లో హెచ్‌ఐసీసీ వేదికగా నిర్వహించిన ఈజీ సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తనదైన ప్రసంగంతో ఆకట్టుకొన్నారు. సదస్సు ముగిసిన తర్వాత హైదరాబాద్ అందాలని ఆస్వాదించారు. గోల్కండ కోటని ఆమె సందర్శించారు. దాదాపు 46నిమిషాల పాటు కోటలో గడిపారు.

మొత్తంగా రెండు రోజుల హైదరాబాద్ పర్యటన ఇవంకాకు కొత్త అనుభూతిని ఇచ్చిందని చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఆమెని రిసీవ్ చేసుకొన్న విధానం. కల్పించిన సదుపాయాలకి అగ్ర రాజ్యం అధ్యక్షుడు తనయ సంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వెలుతూ వెలుతూ.. ఆమె బై బై హైదరాబాద్ అని చెప్పేసి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక వివానంలో అమెరికా వెళ్లారు.