రామ్ కొత్త సినిమా ముచ్చట్లు

ఇటీవలే ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రామ్. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొంది. ఈ సినిమాలో రామ్ లుక్, నటనకి మంచి మార్కులు పడ్దాయి. ఈ సినిమా తర్వాత దిల్ రాజు బ్యానర్’లో రామ్ ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. తాజాగా, ఈ సినిమాపై రామ్ ప్రకటన చేశాడు.

దిల్ రాజు బ్యానర్ లో త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వంలో రామ్ సినిమా తెరకెక్కనుంది. యూనిట్‌ సభ్యులతో కలిసి దిగిన ఓ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన రామ్. ఈ సినిమా వచ్చే యేడాది ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది తెలిపారు. ఈ సినిమాలో రామ్ సరసన కీర్తి సురేష్ జతకట్టనుందని చెబుతున్నారు. గతంలో రామ్ ‘రామ రామ కృష్ణ కృష్ణ’ దిల్ రాజు బ్యానర్ లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.