చాణక్య దర్శకుడి సాహాసం చూశారా ?


యాక్షన్ హీరో గోపీచంద్ సాహాసం చేయబోతున్నాడు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో బాక్సాఫీస్ యుద్ధానికి దిగుతున్నారు. తిరు కృష్ణమూర్తి దర్శకత్వంలో గోపీచంద్ నటించిన స్పై థ్రిల్లర్ చాణక్య. దసరా కానుకగా రేపే (అక్టోబర్ 5)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ‘సైరా’ థియేటర్స్ తో సందడి చేస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉగ్రరూపాన్ని చూసి.. తెలుగు ప్రేక్షకులు గర్వంగా ఫీలవుతున్నారు. విడుదలైన అన్నీ బాషల్లోనూ నరసింహారెడ్డి వీరత్వం, ధీరత్వానికి సలామ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ‘చాణక్య’కి ఏ మేరకు థియేటర్స్ దొరుకుతాయి. సైరా హవాని తట్టుకొని నిలబడుతుందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. గోపీచంద్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రమిది. ఐతే, హిందీ డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలో చాణక్య సినిమాకు రూ. 15కోట్లు రావడం కలిసొచ్చింది. తెలుగు యాక్షన్ సినిమాలకి హిందీలో మంచి గిరాకీ ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిదే చాణక్యకి వరమైంది. మరోవైపు, ఈ సినిమా రిలీజ్ కాకముందే సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు దర్శకుడు తిరు. స్పై థ్రిల్లర్ సినిమా అంటే నాకు బాగా ఇష్టం. అనీ కుదిరితే గోపీచంద్ తో చాణక్య 2 ఉంటుందన్నారు.

ఈ చిత్రంలో గోపీచంద్ కి జంటగా మెహ్రీన్ నటించింది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది.