మెగా ఫ్యామిలీ పార్టీ చేసుకొంది !


మెగా ఫ్యామిలీకి ఓ వారం ముందే దసరా వచ్చేసింది. సైరా బ్లాక్ బస్టర్ హిట్ తో మెగా ఫ్యామిలీ ఆనందంలో ఉంది. ఈ హ్యాపీనెస్ ని గురువారం రాత్రి సెలబ్రేట్ చేసుకొన్నారు కూడా. వాస్తవానికి తెలుగులో వచ్చిన మంచి చిత్రాలని ప్రోత్సహించడం మెగా ఫ్యామిలీ అలవాటుగా పెట్టుకొంది. మహానటి, అర్జున్ రెడ్ది, గీత గోవిందం సినిమాలు సక్సెస్ అయిన సందర్భంలో అల్లు అరవింద్ ఇంట్లో ఆయా చిత్రబృందానికి పార్టీ ఇచ్చారు. ఇప్పుడు సైరా సక్సెస్ ని కూడా సెలబ్రేట్ చేశారు.

గురువారం రాత్రి అల్లు అరవింద్ ఇంట్లో ‘సైరా’ యూనిట్ కు  విందు ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి ఇండస్ట్రీ నుండి చాలా మంది హాజరయ్యారు. మెగా ఫ్యామిలీలో ఒక్క పవన్ కల్యాణ్ తప్ప అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, శిరీష్..  అందరూ ఈ పార్టీలో పాల్గొన్నట్టు సమాచారమ్. దానికి సంబంధించిన ఫోటోలు మాత్రం బయటకి రాలేదు. ఇక సైరా రికార్డ్ వసూళ్లతో దూసుకెళ్తోంది. నరసింహారెడ్డిగా మెగాస్టార్ వీరత్వం, ధీరత్వాన్ని చూసి మెగా అభిమానులు పండగ చేసుకొంటున్నారు.