ఫ్యాక్షన్ లోకి దిగిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకి దసరా గిఫ్ట్ అందజేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన కథానాయిక. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. యంగ్ హీరోలు నవదీప్, సుశాంత్ లకి కీలక పాత్రలు దక్కాయి. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

తాజాగా ఈ సినిమా నుంచి దసరా కానుక వచ్చేసింది. మహేష్ ఫ్యాక్షన్ లోకి దిగారు. కొండారెడ్డి బురుజు ముందు గొండలి పట్టుకొని నిలబడ్డాడు. దసరా కానుకగా సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి వచ్చిన పోస్టర్ ఇది. ఈ పోస్టర్ ఒక్కడు సినిమాని గుర్తి చేసింది. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అదే సమయంలో రాయలసీమ ఫాక్షన్ ని టచ్ చేయనున్నాడట దర్శకుడు. ఆ ఏపీసోడ్ లో విజయశాంతి కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారమ్. 

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ సుంకర్-దిల్ రాజు-మహేష్ బాబు సంయుక్తం నిర్మిస్తున్నారు. ఈ యేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అసలైన సంక్రాంతి సినిమా అనిపించుకొంది. వచ్చే యేదాది సంక్రాంతికి కూడా అనిల్ రావిపూడి మేజిక్ చేస్తారా ? మహేష్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారా ?? అన్నది చూడాలి.