ఉద్యమ నేత ఆమోస్ ఇకలేరు !


తెలంగాణ ఉద్యమ నేత కె.ఆర్ ఆమోస్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాథపడుతున్న ఆయన  తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1969 ఉద్యమ సమయంలో సర్వీస్ నుంచి ఆమోస్ డిస్మిస్ అయ్యారు. దేశంలో.. ఉద్యమం కారణంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోయిన తొలి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.

ఉద్యోగాన్ని కోల్పోయిన తర్వాత ఆయన రాజకీయాల్లో చేరారు. టీఎన్ జీవో అధ్యక్షుడిగానూ ఆయన సేవలందించారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో రెండుసార్లుగా ఎమ్మెల్సీగా సేవలందించారు. ఆ తర్వాత 2016లో ఆమోస్ తెరాసలో చేరారు. ఆమోస్ మృతి పట్ల ఆమోస్ మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు రాజకీయ నేతలు ఆమోస్ మృతికి సంతాపం తెలిపారు.