యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 7గురు మృతి !

శుక్రవారం తెల్లవారుజామున ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపక్కన నిద్రిస్తున్న యాత్రికులపై నుంచి  వైష్ణోదేవీ ఆలయం నుంచి వస్తున్న ఓ బస్సు దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతులంతా బులంద్ షహర్ లోని నరౌరా ఘాట్ లో గంగా నదిలో పవిత్ర స్నానమాచరించేందుకు వచ్చినట్లు సమాచారం.