బీచ్ లో స్వచ్చ భారత్ చేపట్టి మోడీ


ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఉదయం బీచ్ లో స్వచ్చభారత్ చేపట్టారు. ప్రస్తుతం తమిళనాడులోని మహాబలిపురం పర్యటనలో ఉన్న ప్రధాని ఈ ఉదయంమామల్లాపురం బీచ్ కు జాగింగ్ కు వెళ్లారు. ఆ సమయంలో అక్కడ చెత్తను తొలగించాను.దాదాపు అరగంట పాటు మోదీ బీచ్ ను శుభ్రం చేశారు.ఇందుకు సంబంధించిన వీడియోను ప్రధాని తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.

“ఈ ఉదయం మామల్లాపురం బీచ్ కు జాగింగ్ వెళ్లిన సమయంలో అక్కడ చెత్తను తొలగించాను. బహిరంగ ప్రదేశాలను స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంచుదాం. మనమంతా ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందాం” అని మోదీ పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రతే ప్రజల ఆరోగ్యానికి రక్ష అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్ కు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.