‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ యేడాది వాయిదా !


దర్శకధీరుడు రాజమౌళి లెక్కలు ఈసారి తప్పాయని చెబుతున్నారు. బాహుబలి తర్వాత ఆయన చేస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులు. వచ్చే యేదాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడనుంది. ఏకంగా 2021కి వెళ్లనుందనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన కారణాలని కూడా చెబుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ మొదలైనప్పటి నుంచి పలు ఆటంకాలు ఎదురవుతున్నాయ్.

ముందు రామ్ చరణ్, ఆ తర్వాత తారక్ గాయపడ్డారు. తారక్ కోసం తీసుకొన్న హాలీవుడ్ హీరోయిన్ సడెన్ గా సినిమా నుంచి తప్పుకొంది. మరికొన్ని కారణాల వలన సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ అనుకొన్న టైంకి రావడం కష్టంగా ఉంది. ఏకంగా 2021కి వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారమ్. ఇది ప్రచారం మాత్రమే. 

అల్లూరి సీతారామరాజు, కోమరభీమ్ ల జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. వీరిద్దరి జీవితాల్లోని ఓ కామన్ పాయింట్ ఆధారంగా కథని రెడీ చేశాడు జక్కన్న. చరణ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. తారక్ కి జంటగా నటించే హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. ఇక బాహుబలి మించిన సినిమాగా ఆర్ ఆర్ ఆర్  ఉండబోతుందని చెబుతున్నారు.